
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.)
విజయవాడ: ఏపీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వెంకటేశ్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తాజాగా పిటిషన్లు కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మద్యం కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేయగా.. అందులో ఐదుగురు బెయిల్పై విడుదలయ్యారు. విజయవాడ జిల్లా జైలులో ఐదుగురు, గుంటూరులో జైలులో ఇద్దరు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ