
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)
చేవెళ్ల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో
నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చేవెళ్ల టౌన్ కాకుండా 20 గ్రామాలలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా రహదారుల పైన జరుగుతున్న ప్రమాదాలను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బీజాపూర్ జాతీయ రహదారిపై 4 సంవత్సరాలలో రిసార్ట్లు, ఫామ్ హౌస్ లు చాలా పెరిగాయి. అందువల్ల రోడ్డు పై రద్దీగా ఉంటుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు