3 వేల కోట్లలలో ఢిల్లీకి వాటా.. ప్రభుత్వంపై మాజీమంత్రి ఫైర్..!
అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)తెలంగాణ భవన్‌లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన
3 వేల కోట్లలలో ఢిల్లీకి వాటా.. ప్రభుత్వంపై మాజీమంత్రి ఫైర్..!


అమరావతి, 27 అక్టోబర్ (హి.స.)తెలంగాణ భవన్‌లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ ఎవరు పంపారో, ఆ వెనుక ఉన్నది ఎవరో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదని ప్రశ్నించారు. దీనితో ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. మహిళలను, విద్యార్థులను, ఉద్యోగులను, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఇక గత బీఆర్‌ఎస్ పాలనను గుర్తు చేస్తూ… కేసీఆర్ చెప్పకపోయినా ఎన్నో పనులు చేశారని.. కానీ, ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు గొప్పలు చెప్పి, ఇప్పుడు చేతల్లో చూపించడం లేదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారు..దిగి ఆటోలో ప్రయాణించారు. ఆటోలోనే.. తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం దిశగా గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్… వెంగళ్ రావు నగర్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆటోలో ప్రయాణించి.. వారి సమస్యలు విన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారు దిగారు. సోమవారం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్తున్నపుడు ఆయన ప్రయాణిస్తున్న కారు దిగి ఆటో ఎక్కారు. ఆటోలోనే తెలంగాణ భవన్‌ కు చేరుకున్నాడు. తెలంగాణలోని ఆరు లక్షలకుపైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande