
అమరావతి, 28 అక్టోబర్ (హి.స.)
విశాఖపట్నం: మొంథా తుపాను ( తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 9.. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ