
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)
అమరావతి: నవంబర్ 7న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ భేటీని నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నవంబర్ 10వ తేదీకి కేబినెట్ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోట్ విడుదల చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించిన మార్పులను గమనించాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ