
అమరావతి, 30 అక్టోబర్ (హి.స.)
, :రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్కు వరద ) పోటెత్తింది. ప్రాజెక్ట్కు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో.. అధికారులు 4 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్కు 2 లక్షల 74 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కు మున్నేరు, కీసర, వైర, కట్టలేరు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ