హైదరాబాద్, 4 అక్టోబర్ (హి.స.)నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో కూడా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. సాగర్ కుడి కాల్వకు 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,193 క్యూసెక్కులు, పవర్ హౌస్కు 33,291 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 2.16 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. కాగా ప్రస్తుతం 587.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 305.68 టీఎంసీలుగా నమోదైంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు