తెలంగాణ, సిద్దిపేట. 5 అక్టోబర్ (హి.స.)
దేశ శ్రేయస్సే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పదసంచాలన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ దేశ అభ్యున్నతికి పనిచేస్తూ ప్రజల కష్టసుఖాలలో భాగస్వామ్యం అయిందన్నారు.
గ్రూపులుగా విడిపోయిన వామపక్షాలకు ఆర్ఎస్ఎస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. జీవిత కాలంలో కూడా వామపక్ష విశ్లేషకులు సంఘ్ లో ఉన్న క్రమశిక్షణను నేర్చుకోలేరని అన్నారు. వందేళ్ల నుండి పేరు మార్చుకోకుండా ఒకే పేరుతో ఉండి దేశ నిర్మాణం కోసం పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు. దేశ సేవకు అంకితం అవుతూనే భావి భారత పౌరులను అందిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కృషి మరవలేనిది అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు