
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 13 నవంబర్ (హి.స.): పాకిస్థాన్ లో కూర్చుని కుట్రలు చేసి భారత్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు.. తాజాగా రూటు మార్చారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయటంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు.. జైషే మహ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తిమంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తేలింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవటంతో డిసెంబర్ 6న, జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేయటంతో అక్కడి ఉగ్ర ముఠాలు సురక్షితమైన కొత్త స్థావరాన్ని వెతుక్కున్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్యదేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్యదేశాలన్నిం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ