
నల్గొండ, 17 నవంబర్ (హి.స.) రాబోయే ఐదేళ్లు మాత్రమే కాకుండా
మరో పదిహేనేళ్లు తామే అధికారంలో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.74 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం అని ప్రజలకు కూడా అర్థం అయ్యిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు