
నిర్మల్, 2 నవంబర్ (హి.స.)
నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ కె. లక్ష్మణ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు భవనాన్ని వీలు అయినంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు, బోథ్ కోర్టు న్యాయమూర్తి పి. మౌనిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్ రావు, దేశ్ పాండే
తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు