
మొగల్తూరు, 2 నవంబర్ (హి.స.)
మండలంలోని పేరుపాలెం సౌత్ కూడలిలో ఉన్న వినాయకుడి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. నగదును తీసుకుని.. హుండీని ఆలయ సమీపంలో ఉన్న ముళ్ల పొదల్లో పడేశారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ