
తిరుపతి, 2 నవంబర్ (హి.స.)
: తిరుపతిలోని ఆర్పీ గ్రౌండ్లో ఆదివారం ఐఎమ్సీ పవర్ స్ట్రైడ్ ఫిట్నెస్ ఫెస్ట్ 2025 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో పవర్ రన్, జుంబా, డాన్స్, ఫిట్నెస్ ఛాలెంజ్లు, మహిళల కోసం సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. తిరుపతిని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడంలో అందరూ కలసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ