ఆంధ్రప్రదేశ్ లోని.నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం
నెల్లూరు,, 2 నవంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు
ఆంధ్రప్రదేశ్ లోని.నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం


నెల్లూరు,, 2 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు.. సముద్రంలో గాలించి మృతదేహాలని వెలికి తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande