
మంగళగిరి: 0 డిసెంబర్ (హి.స.)పల్లెలే దేశానికి వెన్నెముక అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. ఉద్యోగులు శాఖాపరమైన సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడారు.
‘‘పల్లెల కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. పదేపదే సమీక్షలు నిర్వహించి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు ఇవ్వకపోవడం సరికాదనిపించింది. గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు, బదిలీకి ఓ రేటు పెట్టారు. ఈ పద్ధతిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పాను. పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపు చేయాలని ఆదేశించాను.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ