సీఎం.చంద్రబాబు నాయుడుకి సీపీఐ.రాష్ట్ర కార్యదర్శి. ఈశ్వరయ్య లేఖ
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.), గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల బూత్ స్థాయి అధికార (BLO) విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడుకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం.చంద్రబాబు నాయుడుకి సీపీఐ.రాష్ట్ర కార్యదర్శి. ఈశ్వరయ్య లేఖ


అమరావతి, 15 డిసెంబర్ (హి.స.), గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల బూత్ స్థాయి అధికార (BLO) విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడుకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడుకి ఆయన లేఖ రాశారు.16 రకాల సర్వేలతోపాటు ఎన్నికల విధుల పనిభారంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో 2 నెలల్లో నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 600 మందికిపైగా సచివాలయ ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande