
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.)
, : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సాగు పెట్టుబడి కోసం రూ. లక్ష వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. పీఏసీఎస్ల ద్వారా ఈ రుణాలు మంజూరు చేయనున్నారు. కౌలు రైతులను మరింత ప్రోత్సహించే ప్రణాళికలో భాగంగా అర్హులైన కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ