
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)
తూర్పుగోదావరి, జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. గోపాలపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం, నియోజవర్గ ఇన్చార్జ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ ఇష్యూ కాస్తా చిలికిచిలికి గాలి వానగా మారింది. పార్టీ నాయకులు.. మండల స్థాయి నేతలను, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను పట్టించుకోవడంలేదని అలక వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ