
జోగులాంబ గద్వాల, 21 డిసెంబర్ (హి.స.)
సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు