
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)తెలంగాణ బీజేపీ (Telangana BJP) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు. తెలంగాణ అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్పై కమలం పార్టీ నేతలు షాకింగ్ కామెంట్స్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు