
మహబూబాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
మహబూబాబాద్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. శబరీష్ స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గాలిపటాల ఎగరవేతకు యువత సిద్ధమవుతున్న తరుణంలో, ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకే ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
చైనా మాంజా వినియోగం వల్ల పక్షుల మెడలు, రెక్కలు కోసుకుపోవడం, ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడటం, ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఎస్పీ వివరించారు. ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారిన ఈ నిషేధిత మాంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..