
వరంగల్, 31 డిసెంబర్ (హి.స.)
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని దుండగులు తగలబెట్టిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన్పల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రాజకీయ కక్షల కారణంగానే కొందరు దుండగులు కావాలని విగ్రహానికి నిప్పు పెట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో బంధన్పల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఆత్మగౌరవానికి ప్రతీకైన మహనీయుడి విగ్రహాన్ని అవమానించడం పై హిందూత్వ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..