తెలంగాణ, ఆదిలాబాద్. 11 మే (హి.స.)
ఆదిలాబాద్ జిల్లాలో అసాంఘిక
కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశంతో ఏకకాలంలో 35 బృందాల చేత పది మండలాల్లో స్క్రాప్ దుకాణాలపై మూకుమ్మడిగా తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. దొంగలించిన వస్తువులను స్క్రాప్ దుకాణాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కొనవద్దని, కొన్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ నార్నూర్, బోథ్ మండలాల్లో ఏకకాలంలో స్క్రాప్ దుకాణాలలో జిల్లా పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. 13 స్క్రాప్ దుకాణాల వద్ద పలు అనుమాదాస్పద వస్తువులు లభ్యమైనట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దొంగలించిన బడ్డ సరుకు, వస్తువులను, వాహనాలను, రాగి లాంటి లోహాలను కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు