ముంబై, 3 మే (హి.స.)
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తులం ధర రూ. లక్ష దాటేసి అందరినీ షాక్కి గురి చేసింది. ఇక సామాన్యుడు బంగారం కొనడం కలే అనే అభిప్రాయం వచ్చింది. అయితే తాజాగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కేవలం వారం రోజుల్లోనే సుమారు రూ. 7 వేల వరకు తగ్గడం విశేషం. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మొన్నటికి మొన్న తులం బంగారం లక్షదాటేసింది. అయితే చూస్తుండగానే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతీ రోజూ బంగారం ధరలో క్షీణత కనిపిస్తోంది. రోజుకు కనీసం రూ. 500 చొప్పున తగ్గుతూ వస్తుంది. తాజాగా శనివారం మరోసారి బంగారం ధరలో తగ్గుదల కనిపించింది.
దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,540కి చేరింది. కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 95,500కి దిగొచ్చింది. ఈ మధ్య కాలంలో బంగారం రూ. 95 వేల మార్క్కి చేరడం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,690గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,650 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి