అమరావతి, 12 ఆగస్టు (హి.స.)
పులివెందుల, ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండలం జడ్పీటీసీ పోలింగ్ బూత్ నం.4లోకి వైకాపా నేతలు అక్రమంగా చొరబడ్డారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి నల్ల వెంకట సుబ్బయ్యపై దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నికల ప్రక్రియను భంగపరచడానికి, భయాందోళనలు సృష్టించడానికి వైకాపా నేతలు ప్రణాళికాబద్ధంగా ఈ దాడి జరిపారని తెదేపా నేతలు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ