అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.), ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 ఫైనల్ లిస్ట్ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు అయింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంతోపాటు కలెక్టరేట్లో డీఎస్సీ తుది జాబితాను ప్రదర్శనకు ఉంచారు.
అలాగే మెగా డీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో డీఎస్సీ తుది ఎంపిక జాబితా ఉంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఏపీ మెగా డీఎస్సీ - 2025లో ఎంపికైన అభ్యర్ధులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. అలాగే apdsc.apcfss.in వెబ్సైట్లో ఈ అభ్యర్థుల ఎంపికల జాబితా లభ్యమవుతుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ