.భారత్ పర్యటనలో ఉన్న . మారిషస్ ప్రధాని తిరుమల చేరుకున్నారు
తిరుమల, 15 సెప్టెంబర్ (హి.స.) : భారత్‌ పర్యటనలో ఉన్న మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర ( సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు పద్మావతి అతిథిగృహం వద్ద తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని మారిషస్‌ ప్రధాని న
.భారత్ పర్యటనలో ఉన్న . మారిషస్ ప్రధాని తిరుమల చేరుకున్నారు


తిరుమల, 15 సెప్టెంబర్ (హి.స.)

: భారత్‌ పర్యటనలో ఉన్న మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర ( సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు పద్మావతి అతిథిగృహం వద్ద తితిదే అధికారులు ఘన స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని మారిషస్‌ ప్రధాని నవీన్‌ చంద్ర రాంగులాం సతీసమేతంగా దర్శించుకోనున్నారు.

సెప్టెంబర్‌ 9న భారత్‌ పర్యటనకు విచ్చేసిన మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర.. సెప్టెంబర్‌ 11న ప్రధాని నరేంద్ర మోదీతో వారణాసిలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారతీయులు అధికంగా ఉండే మారిషస్‌కు మన దేశం రూ.5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది. భారత్‌లో నవీన్‌ చంద్ర పర్యటన ఈ నెల 16తో ముగియనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande