25 గ్యాంగ్‌స్టర్ స్థావరాలపై 380 మంది పోలీసుల భారీ దాడులు
ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.)25 గ్యాంగస్టర్‌ స్థావరాలపై జరిగిన దాడుల్లో ఢిల్లీలో 19, హర్యానా, ఎన్సీఆర్‌లో ఆరు ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, ఆయుధ అక్రమ రవాణాతో సహా పలు హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు, విక్కీ టక్కర్‌ల క్రిమినల్ నె
25 గ్యాంగ్‌స్టర్ స్థావరాలపై 380 మంది పోలీసుల భారీ దాడులు


ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.)25 గ్యాంగస్టర్‌ స్థావరాలపై జరిగిన దాడుల్లో ఢిల్లీలో 19, హర్యానా, ఎన్సీఆర్‌లో ఆరు ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, ఆయుధ అక్రమ రవాణాతో సహా పలు హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు, విక్కీ టక్కర్‌ల క్రిమినల్ నెట్‌వర్క్‌లపై దాడులు జరిగాయి. ఈ దాడులలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు,పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 8 పిస్టల్స్, 29 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, మూడు మ్యాగజైన్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్, ఆడి కారు, 14 హై-ఎండ్ లగ్జరీ గడియారాలు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, నగదు లెక్కింపు యంత్రాలు, వాకీ-టాకీ సెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో పోలీసులు 26 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులందరూ నందు, విక్కీ టక్కర్ ముఠాతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande