తెలంగాణ, నారాయణపేట. 17 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ లోని మంత్రి వాకిటి శ్రీహరి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వతంత్రం వచ్చిన తరువాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిన దినమని, తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి దీనినే ప్రభుత్వ పరంగా జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం సంతోషకరమైన విషయం అని మంత్రి శ్రీహరి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు