తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూలైన్
తిరుమల, 18 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండి.. శిలాతోరణం వరకూ క్యూ లైన్ ఉన్నట్లు టీటీడీ (TTD) తెలిపింది. ఇప్పటికే క్యూలైన్లో ఉండ
తిరుమల


తిరుమల, 18 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండి.. శిలాతోరణం వరకూ క్యూ లైన్ ఉన్నట్లు టీటీడీ (TTD) తెలిపింది.

ఇప్పటికే క్యూలైన్లో ఉండి టోకెన్లు లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం జరిగేందుకు 18 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కొత్తగా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

టైమ్ స్లాట్ టోకెన్లు (Time Slot Tokens) ఉన్న భక్తులకు సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని, రూ.300 స్పెషల్ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న (బుధవారం) 68,213 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు వచ్చింది. 29,410 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande