హుజురాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో కారడన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అక్రమంగా ఇసుక లోడ్ చేసిన 16 ట్రాక్టర్లను, సరైన పత్రాలు లేని 14 ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం అందించాలని, అక్రమంగా ఇసుక తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీజి సిబ్బంది, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్సైలు మిగతా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..