అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 29.21 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడుతున్న హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌
హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)పి.ఆర్. • పనులు శరవేగంతో కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నాయి ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునారభివృద్ధి చేయడం ద్వా
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 29.21 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడుతున్న హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌


హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)పి.ఆర్.

• పనులు శరవేగంతో కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నాయి

ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునారభివృద్ధి చేయడం ద్వారా ఒక పెద్ద పరివర్తనను చేపడుతున్నాయి. “అమృత్ భారత్ స్టేషన్ పథకం” (ఏ.బి.ఎస్.ఎస్.)కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆగస్టు, 2023 మరియు ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేసినప్పుడు ఈ మిషన్‌కు గొప్ప విశిష్ఠత లభించింది.

ఈ జాబితాలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ మరియు లింగంపల్లి రైల్వే స్టేషన్ల ప్రధాన పునారభివృద్ధి కూడా ఉంది, వీటి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున పనులు చేపట్టబడ్డాయి. రైలు ప్రయాణ నాణ్యతను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి భారతీయ రైల్వేలు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” (ఏ.బి.ఎస్.ఎస్) ఆనే చొరవను చేపట్టింది. ఇది రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణముగా వివిధ కీలక అంశాల అభివృద్ది పై ఆధారపడింది

హఫీజ్‌పేట అమృత్ రైల్వే స్టేషన్

• అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా పునరాభివృద్ధి చేయబడుతున్న 40 రైల్వే స్టేషన్లలో హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ ఒకటి.

• హైదరాబాద్ & సికింద్రాబాద్ జంట నగర ప్రాంతంలోని ముఖ్యమైన సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఒకటిగానున్న ఈ స్టేషన్ సబర్బన్ గ్రేడ్ -3 (ఎస్.జి-3) గా వర్గీకరించబడింది.

• ప్రస్తుతం, ఈ స్టేషన్ ప్రధానంగా సబర్బన్ ప్రయాణీకులు మరియు స్వల్ప దూర రైళ్ల ప్రయాణీకుల అవసరాలను తీరుస్తోంది. స్టేషన్‌కు సగటున రోజుకు 9,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

• ఈ స్టేషన్లో దాదాపు 60 ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు మరియు 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి.

• హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి మరియు హఫీజ్‌పేట స్టేషన్ పశ్చిమాన మరియు ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటంతో, ఈ స్టేషన్ రోజురోజుకూ దాని ప్రాముఖ్యతను పెంచుకుంటోంది.

• హఫీజ్‌పేట స్టేషన్ పునరాభివృద్ధికి అంచనా వ్యయం రూ.29.21 కోట్లు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన సౌకర్యాలు

• ప్రస్తుత స్టేషన్ భవనానికి మెరుగుదలలు.

• స్టేషన్ ఆవరణ ప్రాంత అభివృద్ధి

• 2 లిఫ్టులు మరియు 2 ఎస్కలేటర్ల తో పాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం

• ప్లాట్‌ఫామ్ పై కప్పు అదనంగా ఏర్పాటు

• ప్లాట్‌ఫామ్ ఉపరితలాన్ని మెరుగుపరచడం

• వెయిటింగ్ హాల్ పునరుద్ధరణ

• టాయిలెట్ బ్లాక్స్

పునరాభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి

 ప్లాట్‌ఫామ్ పై కప్పు, సర్క్యులేటింగ్ ఏరియా మరియు స్టేషన్ భవనం యొక్క నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

 చివరి దశలో వెయిటింగ్ హాల్ పునరుద్ధరణతో పాటు స్టేషన్ భవనానికి మెరుగుదలలు.

 ప్లాట్‌ఫామ్ ఉపరితలం మెరుగుదల, లిఫ్ట్‌లు మరియు ఎస్కలేటర్‌లతో పాటు 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

 సూచిక బోర్డులు, టాయిలెట్ బ్లాక్‌లు, ముఖభాగం లైటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.

 పనులు వేగంగా జరుగుతున్నాయి మరియు ఒకటి లేదా రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande