
అహ్మదాబాద్, 12 జనవరి (హి.స.) ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను ప్రారంభించారు (International Kite Festival). జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ.. అహ్మదాబాద్లోని సబర్మతి నదీతీరంలో జరుగుతోన్న ఈ ఫెస్టివల్లో ఛాన్స్లర్తో కలిసి కైట్ ఎగురవేశారు.
ఈ ఉత్సవంలో 50 దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో హనుమాన్ పతంగి ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది ఈ ఫెస్టివల్కు 3.83 లక్షల మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక్కడికి వచ్చేవారు ధోలవీర, ఐక్యతా విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర పర్యాటకానికి ఊతం లభిస్తోందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ