
శ్రీసత్యసాయి జిల్లా, 18 జనవరి (హి.స.)
నల్లమాడ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ