
ఆత్రేయపురం, 02 జనవరి (హి.స.)
: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం మండలం పులిదిండిలో పడవ పోటీల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ట్రయల్ రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ మహేశ్కుమార్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన అదుపుతప్పి కాలువలో పడిపోయారు. వెంటనే అక్కడున్న స్విమ్మర్లు ఆయన్ను రక్షించి వేరే పడవలోకి ఎక్కించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ