
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.) సినీ నిర్మాత బండ్ల గణేష్ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయన క్షేమంగా బయటకు రావాలని శ్రీవారికి మొక్కుకున్న బండ్ల గణేష్... తెలంగాణలోని షాద్నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సంకల్పయాత్ర ప్రారంభించి 537 కిలోమీటర్లు 23 రోజులపాటు నిరంతరాయంగా నడిచి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకున్న తర్వాత అమరావతిలోని ఏపీ అసెంబ్లీకి వచ్చిన గణేష్.. సీఎం చంద్రబాబును కలిశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ