
అనకాపల్లి, 10 మార్చి (హి.స.)
ఏటికొప్పాక సమీపంలో వరాహ నదీ వద్ద బాలుడు ఆడారి వెంకట్ కౌశిక్ మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మైనర్ బాలుడి చేతిలోని నాటు తుపాకీ పేలడంతోనే కౌశిక మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నాటు తుపాకీ పేలిన ఘటనలో కౌశిక్ మృతి చెందగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విషయం వెల్లడైందని పోలీసులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ