తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి
దేవరపల్లి, 22 మార్చి (హి.స.)తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్లైఓవర్పై ఒక కారు రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్ట
రోడ్డు ప్రమాదం


దేవరపల్లి, 22 మార్చి (హి.స.)తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఫ్లైఓవర్పై ఒక కారు రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కార్లు నుజ్జునుజ్జయ్యాయి.

మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande