
తిరుమల, 22 మార్చి (హి.స.)
తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్లో సర్వదర్శనానికి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల వరకూ క్యూలైన్లో ఉండి, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లిన భక్తులకు 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. భక్తుల రద్దీని బట్టి టోకెన్ లేని భక్తుల దర్శనం వెయిటింగ్ సమయం మారుతుందని పేర్కొంది. కాగా.. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4-7 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా.. నిన్న (శనివారం) స్వామివారిని 77,864 మంది భక్తులు దర్శించుకోగా.. 39,348 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV