
న్యూఢిల్లీ, 29 మార్చి (హి.స.) పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయం అందించిన గల్ఫ్ దేశాలకు ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో భారతీయులకు అండగా నిలిచిన యూఏఈ (UAE), సౌదీ అరేబియా (Saudi Arabia) ఖతార్, ఒమన్ (Oman) దేశాల నాయకత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయినప్పుడు వేలాదిమంది భారతీయులను తమ దేశాల మీదుగా స్వదేశానికి పంపేందుకు గల్ఫ్ దేశాలు చూపిన చొరవ మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ సంక్షోభసమయంలో దుబాయ్, అబుదాబీ, మస్కట్ విమానాశ్రయాలు భారతీయుల తరలింపునకు కీలక కేంద్రాలుగా మారాయి. ముఖ్యంగా ఇరాన్ నుంచి భారతీయులను ఒమన్ మీదుగా తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేయడం వారి సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.
గల్ఫ్ దేశాలతో భారత్కు ఉన్న బలమైన దౌత్య సంబంధాల వల్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా వేలాది మందిని సురక్షితంగా తీసుకురాగలిగామని ప్రధాని మోదీ చెప్పారు. 'కష్టకాలంలో ఆదుకున్న గల్ఫ్ దేశాల నాయకులకు భారత్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది' అని ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ కార్మికులు, వారి కుటుంబాల భద్రతను పర్యవేక్షిస్తున్న ఆయా దేశాల ప్రభుత్వాలకు కూడా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు