
సూరత్, 31 మార్చి (హి.స.)
మూడంతస్తుల భవనం లో భారీ అగ్నిప్రమాదం
(Massive fire Accident) చోటు చేసుకొని చిన్నారి సహా ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లోని సూరత్ నగరం లింబాయత్ ప్రాంతంలోని మిథీ ఖాడీలో మంగళవారం చోటుచేసుకుంది. ఒక మూడంతస్తుల భవనం లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు, ఒక నాలుగేళ్ల బాలుడు మృతి చెందారు. ఆ కుటుంబం ఇంట్లోనే చీరల ప్యాకింగ్ పనులను నిర్వహిస్తోందని, ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..