
ఒంటిమిట్ట, 02 ఏప్రిల్ (హి.స.)
: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు రామయ్యకు రథోత్సవం నిర్వహించారు. తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీరబ్రహ్మం, శరత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తేరు చక్రాలు కదిలాయి. ప్రతిఒక్కరిలో భక్తి భావం ఉప్పొంగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ