
అనకాపల్లి, 20 ఏప్రిల్ (హి.స.)
:అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో భూమి రికార్డుల సవరణ కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో పోతల శంకర్రావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఒక రైతు తన భూమి రికార్డుల్లో పేరు మార్పు చేసి, ఎల్పీఎం జారీ చేయించుకోవడానికి వీఆర్వోను సంప్రదించారు. ఈ పని చేయడానికి వీఆర్వో శంకర్రావు రూ.1.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి వీఆర్వో నగదు తీసుకుంటుండగా అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ