
అమరావతి, 28 ఏప్రిల్ (హి.స.)
విశాఖ: సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోం మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికి వేదాశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం సిరిపురం వీఎంఆర్డీఏకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెళ్లారు. రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ