వలస కార్మికులకు కేంద్రం తీపికబురు.. 5 KG ఉచిత సిలిండర్ల కోటా రెట్టింపు
5 కేజీల ఉచిత వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోటాను రెట్టింపు చేసిన కేంద్రం
Good news


న్యూఢిల్లీ, 07 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమాసియా (West Asia)లో యుద్ధం కారణంగా ఎల్పీజీ (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వలస కార్మికులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రోజువారీ కేటాయించే 5 కేజీల ఉచిత వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోటాను(Free Trade LPG cylinders) రెట్టింపు చేసింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఓఎంసీల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. అయితే, ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వేళ 5 కేజీల బరువుండే 'ఛోటూ' (Chotu) సిలిండర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మేజర్ పట్టణాలు, టౌన్లలో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గ్యాస్ కనెక్షన్ల కోసం అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (Identity Proof) చూపిస్తే 5 కేజీల 'ఛోటూ' సిలిండర్ను సులభంగా పొందవచ్చు

రాష్ట్రాలకు అందించే అదనపు సిలిండర్ల సరఫరాను ఈ ఏడాది మార్చి 2 నుంచి 3 తేదీల్లో అందించిన సగటు సరఫరా ఆధారంగా లెక్కించనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande