
హైదరాబాద్, 31 మే (హి.స.)
సీబీఎస్ఈ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ ప్రభుత్వాన్ని సాధారణ ప్రశ్నలు అడిగిన విద్యార్థులు సమాధానాలకు బదులుగా అవమానాలను ఎదుర్కొన్నారని విమర్శించింది. విద్యార్థులు ధైర్యవంతులైన యువ భారతీయులని కొనియాడింది. మోదీ సర్కార్ను ప్రశ్నించిన విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు అర్హులని అభిప్రాయపడింది. వారు మంచి భవిష్యత్తును పొందేలా తాము చూస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కొంతమంది విద్యార్థులతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు. గాంధీ ఈ వీడియో క్లిప్ను తన తోటి దేశద్రోహ సోరోస్ ఏజెంట్లతో జరిపిన అసలు విషయాలు బయటపెట్టే సంభాషణగా అభివర్ణించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi