
ఢిల్లీ, 02 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు తెలుగులో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో నేతలిద్దరూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం సాహసం, సంకల్పం, పోరాట పటిమకు ఒక శక్తిమంతమైన ప్రతీక అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడి ప్రజల సృజనాత్మకత, వ్యాపార నైపుణ్యాలు అద్భుతమైనవని, వికసిత భారత్ కలని సాకారం చేయడంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని స్పష్టం చేస్తూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi