
అమరావతి, 20 జూన్ (హి.స.)
ఆత్మకూరు ): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు మార్పునకు సంబంధించి ఎమ్మార్వో డి.శాంతిస్వరూప్ ఓ రైతు నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ