
నాగర్ కర్నూల్, 27 జూన్ (హి.స.)
నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణా
నది పరివాహక ప్రాంతంలో వెలసిన అక్కమహాదేవి గుహలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ దంపతులు శనివారం సందర్శించారు. అక్కమహాదేవి గుహల చరిత్రను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రముఖ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని, పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. ఆయన వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు