
హైదరాబాద్, 29 జూన్ (హి.స.)మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయబోమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్లు కోల్పోయేవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్నారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసంలో రాజీ ఉండదని పొంగులేటి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్